కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో వైసీపీ గర్జించడమేంటి ? – పవన్ కళ్యాణ్

-

కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో వైసీపీ గర్జించడమేంటి ? అని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నేతల అరెస్ట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ తాజాగా స్పందించారు. ప్రభుత్వంలో గర్జించడం ఏంటి ? కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో ఉన్నవారు గర్జిస్తామంటారేంటి? పథకాలు అమలు చేయాలి.. నిరసన తెలుపుతామంటే ఎలా? అని నిలదీశారు పవన్ కళ్యాణ్.

ప్రభుత్వంతో పోటీ మాకెందుకు. ఎన్నికల టైంలోనే పోటీ వుంటుందన్నారు. అధికారులు మామీద జులుం చూపించారు. ప్రభుత్వానికి అండగా వున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే నాకు గౌరవం లేదన్న వ్యక్తి సీఎం. ఆయన దగ్గర మీరు పనిచేస్తున్నారని ఆగ్రహించారు. మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారట అంటూ జనసేన కార్యకర్తలు ఫోన్లు చేశారు. నన్ను లిఫ్ట్ చేయాల్సిన అవసరం వుంది. మేం ఏమన్నా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news