Flash : పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ లో పోలీసుల దాడులు..కీలక నేతలు అరెస్ట్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం కోసం శనివారమే పవన్ వైజాగ్ చేరుకున్నారు. శనివారం రాత్రి ఆయన నగరంలోని నోవాటెల్ హోటల్ లో బస చేశారు.

పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ బస చేసిన ఫ్లోర్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నోవాటెల్ పరిసరాల్లోకి జనసేన కార్యకర్తలతో పాటు ఎవరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

జనసేన నాయకులు కోన తాతారావు, సందీప్ పంచకర్ల, సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్.రాజు, యశస్విని, మూర్తి యాదవ్, గేదెల చైతన్య, కీర్తిష్, శ్రీధర్, ఉమాను పోలీసు అరెస్టు చేశారని నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ బస చేసిన గది దగ్గరకు పోలీసులు వచ్చారని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news