మరో సిబిఐ విచారణ అంటున్న పవన్

-

ట్విట్టర్ వేదికగా మరోసారి తెర పైకి శ్రీవారి పింక్ డైమండ్ అంశం వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి పింక్ డైమండ్ ఏమైందో సిబిఐ చేత విచారణ జరపాలని అయన డిమాండ్ చేసారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేసారు. పింక్ డైమండ్ మాయమైందంటూ గతంలోనే రమణదీక్షితులు సంచలన విషయాలు చెప్పారని ఆయన గుర్తు చేసారు.

ఆ వజ్రం ఎటుపోయ్యిందో తేల్చాలని డిమాండ్ చేసారు. శ్రీవారికీ కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాల లెక్కలు ఆరా తీయ్యాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో పింక్ డిమాండ్ విషయంలో ఎక్కువగా హడావుడి జరిగింది. ఆ తర్వాత ఆ అంశాన్ని ఎవరూ కూడా ప్రస్తావించలేదు. తాజాగా మరోసారి పవన్ వెలుగులోకి తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news