పుట్టామధు కోసం ఇంత ఆపరేషన్ జరిగిందా…?

-

న్యాయవాద దంపతులు వామన రావు హత్యకు సంబంధించి తెలంగాణా పోలీసులు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిని పట్టుకోవడానికి తెలంగాణా పోలీసులు చాలా కష్టపడ్డారు. తెలంగాణా పెద్దపల్లి జడ్ పీ చైర్మన్ పుట్టా మధు కోసం నిన్నంతా భీమవరంలో తెలంగాణా పోలీసులు గాలించారు. పలు లాడ్జీలు, హోటల్స్ లో రూమ్ కావాలని తెలంగాణా పోలీసులు తిరిగారు.

దాదాపు ఎనిమిది మంది వచ్చినట్లు చెబుతున్న పలు హోటళ్ల సిబ్బంది… ఎందుకు వచ్చారో తెలియదని బదులు ఇచ్చారు. పుట్టా మధు కోసం గాలిస్తున్న దృశ్యాలు పలు హోటళ్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పుట్టా మధు అరెస్టుపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు నోరు మెదపడం లేదు. తమకు ఎటువంటి సమాచారం లేదని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఉన్నత స్థాయిలో ఒత్తిడి వలనే పోలీసు అధికారులు అలా అంటున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news