ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రేవంత్ రెడ్డి బంధువులు – పెద్దిరెడ్డి సంచలనం

-

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ.. ఈ స్కాంలో కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. అయితే.. దీనిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఏపి ప్రభుత్వం కు సంబంధం లేదని చెప్పారు. వైఎస్ భారతమ్మ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి బంధువులు లిక్కర్ స్కాం సూత్రధారులు… ఉద్దేశ్యపూర్వకంగా దీనిని వైఎస్ జగన్ కుటుంబీకులకు అంటగడుతున్నారని నిప్పులు చెరిగారు. సిగ్గుమలిన వ్యక్తులే ఇలా కుటుంబీకుల పై ఆరోపణలు చేస్తారు…మాపై రాజకీయాలు చేయండి ఎదుర్కొంటాము… వైఎస్ కుటుంబీకులను లాగితే ఊరుకోను అని హెచ్చరిస్తున్నానన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై పోరాడుతున్నామన్నారు. ఈ బకాయిలు ఎగ్గొట్టడానికే 1700 కోట్లు మాకే ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిన్న కోర్టును ఆశ్రయించింది…. లీగల్ గా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news