పీవీఆర్ సినిమాస్, బుక్ మై షో యాప్‌లకు జరిమానా విధింపు

-

హైదరాబాద్: ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకులను నుంచి అధనంగా డబ్బులు వసూలు చేయడంపై జిల్లా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ల ధరపై అధనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన కమిషన్ తీర్పును వెలువరించింది.

పీవీఆర్-బుక్ మై షో
పీవీఆర్-బుక్ మై షో

ఈ మేరకు టికెట్ ధరపై అధనంగా రూ.6 వసూలు చేసుకోమని తీర్పును వెలువరించింది. దీంతోపాటు ఫిర్యాదు దారుడైన విజయ్ గోపాల్‌కు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని, కేసు ఖర్చులకు రూ.1000, మరో రూ.5 వేలు లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలని బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు ఆదేశించింది. 45 రోజులలోపు డబ్బులు చెల్లించాలని, లేకుండా తీర్పు వెలువరించిన కాలం నుంచి 18 శాతం వడ్డీ కొనసాగుతుందని హెచ్చరించారు. కాగా, సికింద్రాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్‌లో సినిమా చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో రూ.41.78తో కలిపి మొత్తం రూ.341.78 బిల్లు అయింది.

అయితే, సాధారణ టికెట్ ధర కంటే సుమారు 18 శాతం అదనంగా డబ్బులు వసూలు చేయడంపై ఆయ ప్రశ్నించాడు. ఈ మేరకు సెంట్రల్ కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీకి 2019 జనవరి 18వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 అధ్యక్షుడు నిర్మ నారాయణ, సభ్యురాలు సి.లక్ష్మిప్రసన్న వివరణ ఇవ్వాలని బుక్ మై షో సంస్థకు తెలిపింది. స్పందించిన బుక్ మై షో సంస్థ విజయ్ గోపాల్ ఫిర్యాదు నిరాధారమని, కేసును కొట్టి వేయాలని తెలిపారు. వాదోప వాదాలు విన్న కమిషన్ ఇద్దరికి అనుకూలంగా తీర్పును వెలువరించినట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news