రేపటినుండి వారం రోజులపాటు ఏపీలో పెన్షన్ వారోత్సవాలు

-

న్యూ ఇయర్ వేల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి వారం రోజులపాటు పెన్షన్ వారోత్సవాలు నిర్వహించనున్నారు. అంతేకాక జనవరి ఒకటవ తేదీ నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం రూ. 2,750 నీ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఇక కొత్తగా 2 లక్షల 31 వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది.

ఫలితంగా దేశంలో అత్యధిక 64 లక్షల మందికి పైగా పింఛన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వంగా ఏపీ ప్రభుత్వం నిలిచింది. ఇక జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్. రెండు వారాల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news