వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి ఇక అంతే : చంద్రబాబు

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ తిరుగుబాటే జగన్ ను ఇంటికి పంపిస్తుందని, రాయలసీమలో అన్ని సీట్లూ కూటమే కొల్లగొడుతుందని అన్నారు.

పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్డీయే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి ఇక అంతే అని తెలిపారు. మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తోంది అని మండిపడ్డారు.ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి అని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.అంతేకాదు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా చేయకుండా రాజంపేట ప్రజలకు అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లెకి అన్యాయం చేయమని చెప్పారు.ప్రజాభిప్రాయంతోనే పాలన అందిస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను అండగా ఉంటామని అన్నారు. గాలేరు-నగరి కాలవను పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news