కేఏ పాల్‌ పార్టీలాగే, BRS పార్టీ..కేసీఆర్ కు అంత సీన్ లేదు – పేర్ని నాని

-

 

ఏపీలో సీఎం కేసీఆర్‌ ఏం చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్‌ పార్టీలాగే, BRS పార్టీ ఉంటుందన్నారు. ఏపీలో కేసీఆర్ కు అంత సీన్ లేదని విమర్శలు చేశారు పేర్ని నాని. ఏపీకి అన్యాయం చేసింది వాళ్లేనని ఆగ్రహించారు. చంద్రన్న కానుక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే.

ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడంలేదా? అని ప్రశ్నించారు పేర్ని నాని.

చంద్రబాబు సభలకు జనం రావడంలేదని, జనాన్ని తరలించారని ఆరోపించారు. గుంటూరు సభకు ఇన్నివేలమందిని తరలించడం ఉయ్యూరు ట్రస్టుకు సాధ్యమయ్యే పనేనా…? అని పేర్ని నాని నిలదీశారు. ఉయ్యూరు ట్రస్టు కార్యక్రమం అనేది ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు పేర్ని నాని. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నారని అన్నారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news