వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

-

మన దేశంలో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటి 150 వైపు వెళుతోంది. అటు డీజిల్‌ కూడా పెట్రోల్‌ తో పోటీ పడుతోంది. అయితే… తాజాగా మరోసారి మన దేశంలో పెట్రోల్‌ మరియు డిజీల్‌ ధరలు పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, లీటర్‌ డీజిల్‌ పై 90 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.81 కు చేరగా డీజిల్ ధర రూ. 93. 07 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.42 కు చేరగా డీజిల్ ధర రూ. 100. 71 కు పెరిగింది. ముంబై లో రూ. 116.72 , కు చేరగా డీజిల్ ధర రూ. 100.94 కు పెరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117. 61 కు చేరగా డీజిల్ ధర రూ. 101.97 కు చేరుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news