ఏప్రిల్ 25న ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలి – మంత్రి కేటీఆర్

-

ఏప్రిల్ 25వ తేదీన ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనుక భారీ కుట్ర ఉందన్నారు కేటీఆర్.

నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను దోస్తులకు అంకితం చేయటం మోదీ విధానమని అన్నారు. బైలాదిల్లా అనేది 1.34 బిలియన్‌ టన్నుల ఐరన్ ఓర్‌ లభించే గని అని తెలిపారు. విశాఖ ఉక్కుకు, బయ్యారం గనులకు ఒక సంబంధం ఉందని చెప్పారు. బైలాదిల్లా గని బయ్యారానికి 160 కి.మీ. దూరంలోనే ఉందన్న మంత్రి.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోనే ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news