రైతులకు శుభవార్త..ఎల్లుండే PM-KISHAN నిధులు విడుదల

-

దీపావళి ముందు రైతులందరికీ కేంద్రం తీపి కబురు చెప్పబోతోంది. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. రైతులకు ఈ స్కీమ్ కింద మూడు విడతల్లో ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల్ని పంపిస్తుంది.

ఇప్పటి వరకు ప్రభుత్వం నేరుగా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. త్వరలో 12వ విడతని కూడా రైతులకు కేంద్రం అందిస్తున్నట్లు తెలుస్తోంది. PM KISAN తాజాగా వచ్చిన సమాచారం మేరకు రైతుల ఖాతాల్లోకి ఎల్లుండి అంటే ఈ నెల 17వ తేదీకి డబ్బులు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద డబ్బులు అందడానికి 10 రోజులు పడతాయి. ఇక ఈ డబ్బులు పడ్డాయా ? లేదా ? అని తెలుసకునేందుకు https://pmkisan.gov.in/ వెబ్ సైటులో చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news