కాశీ, తమిళనాడు రెండు సంగీత, సాహిత్య, కళారంగాలకు పెట్టిందిపేరు : మోడీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంగమం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో మధ్య ప్రాచీన కాలంలో సాంస్కృతిక కేంద్రాలుగా తమిళనాడు, కాశీలు గుర్తింపుపొందాయని.. ఆనాటి సంబంధాలను పునరుద్ధరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమిళనాడు, కాశీల మధ్య ప్రాచీనకాలంలో కొనసాగిన సంబంధాలను పునరుద్ధరించటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న.. కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసిలో శనివారం ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే అతి ముఖ్యమైన, ప్రాచీన సాంస్కృతిక కేంద్రాలుగా గుర్తింపు పొందిన తమిళనాడు, కాశీ మధ్య ఉన్న ప్రాచీనకాలం నాటి సంబంధాలను తిరిగి పునరుద్ధరించి, వేడుక చేసుకోవటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

PM Modi inaugurates Kashi Tamil Sangamam in Varanasi - Hindustan Times

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాశీ, తమిళనాడు రెండు సంగీత, సాహిత్య, కళారంగాలకు పెట్టిందిపేరు. కాశీ తబల, తమిళనాడు తన్నుమాయి, కాశీలో బనారస్‌ చీరలు లభిస్తాయి. తమిళనాడు కంచి సిల్క్‌ ప్రపంచప్రఖ్యాతి గాంచింది. రెండుప్రాంతాలు దేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తలు, ఆచార్యులకు జన్మభూమి, కర్మభూమి. కాశీ భక్త్‌ తులసీదాస్‌ పుట్టినగడ్డ. తమిళనాడు సంత్‌ తిరువళ్‌వర్‌ భక్త్‌ భూమి. జీవితంలోని అన్నిరంగాలు, అన్ని కోణాలతోపాటు కాశీ, తమిళనాడు వేర్వేరు రంగాల్లో సారూప్యం కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news