Mission LiFE ప్రారంభోత్సవ వేళ .. మోదీకి ప్రపంచ దేశాల ప్రశంసలు

-

పర్యావరణ పరిరక్షణను ఒక సామూహిక ఉద్యమంగా మార్చే దిశగా ప్రధాని మోదీ గుజరాత్ లో మిషన్ లైఫ్ ను ప్రారంభించారు. వాతావరణ మార్పులతో కలిగే వినాశనకరమైన పర్యావసానాల నుంచి భూ గ్రహాన్ని రక్షించేందుకు భారత్‌ నేతృత్వంలో అంతర్జాతీయ మోదీ శ్రీకారం చుట్టారు. కేవడీయాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానితో పాటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ మిషన్‌ ఆరంభించారు. ప్రతిచోటా వాతావరణ మార్పు ప్రభావం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క భారత్ చూపిన చొరవను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.

ఈ మిషన్‌ లైఫ్‌ ప్రారంభంపై ప్రపంచ దేశాలు భారత్‌ను కొనియాడాయి. ‘డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్, డియర్ నరేంద్ర, ఇతర సిబ్బంది, స్నేహితులకు నమస్తే. ఈ ప్రత్యేక సమయంలో నేను మీ వద్ద ఉండాలనుకున్నాను. భారత్‌ ప్రారంభించిన ఈ మిషన్‌ విజయం సాధించేలా ఫ్రాన్స్‌ కూడా కలిసి పనిచేయాలనుకుంటోంది’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ సందేశం పంపారు. మడగాస్కర్, జార్జియా, బ్రిటన్‌ వంటి పలు దేశాలు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించాయి.

మరోవైపు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ జీ 20 దేశాల సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ‘జీ 20 దేశాలు 80 శాతం గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ను విడుదల చేస్తున్నాయి. మరోపక్క ఆ దేశాలే ప్రపంచ జీడీపీలో 80 శాతం వాటాను కలిగిఉన్నాయి. స్థిరమైన జీవనం వైపు నడిపించే శక్తి, ప్రకృతిని పరిరక్షించే సామర్థ్యం వాటికి ఉన్నాయి’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news