BREAKING : తెలంగాణ స్పీకర్‌కు కరోనా.. ఆస్పత్రిలోకి తరలింపు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవ సృష్టిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా… అందరికీ కరోనా సోకుతుంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలబ్రీటీలు ఇలా అందరికీ ఈ కరోనా మహమ్మారి సోకింది. ఇక తాజాగా తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ కు కరోనా సోకడం ఇది రెండవ సారి.

నెల రోజుల కిందట… తన మనవరాలి పెళ్లి సమయం లో పోచారం శ్రీనివాస్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అయితే.. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌ చేయించగా ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోచారం శ్రీనివాస్‌. ప్రస్తుతం పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోగ్యం నిలకడ గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని… ఆయన త్వరగానే కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news