భూ వివాదంలో సినీ నిర్మాత సి.కల్యాణ్‌‌తో పాటు మరో ముగ్గురిపై కేసు

-

హైదరాబాద్: షేక్‌పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీ నిర్మాత సి.కల్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశారు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. నారాయణమూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నారు.

dఅయితే సోమవారం సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు  ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితోపాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సి.కల్యాణ్ వివరణను పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. సి. కల్యాణ్ పోలీస్ స్టేషన్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news