రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరణ

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.

‘మీరు సెప్టెంబర్‌ 12 నుంచి మహాపాదయాత్ర చేయడానికి అనుమతి కోరారు. దానిలో 200 మందికి పైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళతామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లాల పోలీసు అధికారులకు పంపి అభిప్రాయం కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులిస్తున్నాను. గతేడాది మీరు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో మీకు అనుమతిచ్చాం. పాదయాత్రలో మీరు ఆ షరతులన్నీ ఉల్లంఘించారు. పాదయాత్రలో ఎవరు పాల్గొంటారో, ఎంత మంది పాల్గొంటారో తెలియనప్పుడు, వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా అధికారులకు కష్టమవుతుంది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నాం’ అని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news