ఇవాళ వైఎస్సార్సీపీలో చేరనున్న మోహన్ బాబు

-

ఇదివరకు కూడా మోహన్ బాబు రాజకీయాల్లోకి దిగుతున్నారని… వైసీపీలో చేరుతారని పుకార్లు వినిపించాయి. ఆయన కొడుకు మంచు మనోజ్ కు కూడా రాజకీయాలంటే ఆసక్తి అని… ఇద్దరు కలిసి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి…

ఏపీలో ఎన్నికలు యమారంజుగా ఉన్నాయి. రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార టీడీపీకి మాత్రం షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి సినీ గ్లామర్ కూడా యాడ్ అవుతోంది. ఇప్పటికే సినీ నటుడు అలీ, రాజారవీంద్ర, రోజా వైఎస్సార్సీపీలో ఉండగా.. తాజాగా మరో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఇవాళ లోటస్ పాండ్ లో జగన్ ను కలిసి పార్టీ కండువాను కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.



Actor mohan babu to join in ysrcp today

ఆయన గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీలో చేరితే.. ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి ఢిల్లీకి పంపాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news