మళ్ళీ తిరుమలలో అడుగుపెట్టిన పృథ్వీ…!

-

పృథ్వీ రాజ్… కొన్నాళ్ళు టాలీవుడ్ లో ఎక్కువగా వినపడిన ఈ పేరు కొన్ని రోజుల నుంచి రాజకీయాల్లో ఎక్కువగా వినపడుతుంది. సినిమాల్లో ఎంత గుర్తింపు వచ్చిందో తెలియదు గాని ఆయన మాట్లాడిన ఆడియో టేప్ విషయంలో మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. వైసీపీలో ఆయనను ఉంచవద్దు అనే డిమాండ్లు కూడా వినిపించాయి. దీనితో జగన్ ఆయన్ను పక్కకి తప్పించారు. ఆ ఆడియో టేప్ బయటకు రావడంతో ఆయన…

ఎస్వీబీసి చైర్మన్ పదవికి రాజీనామా చేసారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని, టీడీపీ నేతలను తిట్టినా పెద్దగా గుర్తింపు రాలేదు ఆయనకు. ఇక మీడియాలో కూడా ఆయన వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పవచ్చు. ఆయన ఆడియో ఇప్పటికి ట్రోల్ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆయన తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ తిరుమల కొండ మీద దర్శనం ఇచ్చారు.

ఆయన కాలి నడకన శ్రీవారి దర్శనానికి వచ్చారు. దీనిని కూడా మీడియా ఫోకస్ చేసింది. ఇక ఆయనకు పార్టీలో పదవి ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఆయన మీద జగన్ కి చిరాకు వచ్చింది అని, రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆడియో టేప్ వ్యవహారం, ఎస్వీబీసిలో ఆయన చేసిన పనులు ఇలా అన్నీ కూడా వివాదాలకు కేంద్రంగా మారాయని, అందుకే జగన్ ఆయన్ను పక్కన పెట్టారని అంటున్నారు. మరి సినిమాలు చేసుకుంటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news