తాడిపత్రిలో పురివిప్పిన పాతకక్షలు!

-

  • కత్తులతో దాడి.. ఇద్దరు మృతి


అనంతపురం (తాడిపత్రి): అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువులో పాత కక్షలు పురివిప్పాయి. నలుగురు వ్యక్తులపై హఠాత్తుగా జరిగిన దాడిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. తాడిపత్రిలోని పెన్నా సిమెంట్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద శుక్రవారం వెంకటరమణ, తలారి రంగయ్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండగా హఠాత్తుగా కొందరు దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా రంగయ్య మార్గమధ్యంలో మృతిచెందాడు. పాతకక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news