నమ్మించి వంచించిన బిజేపీని ఎలా నమ్మేది?- కళా వెంకట్రావు

-

  • అక్టోబరులో రాజమహేంద్రిలో టిడిపి బీసీ గర్జన

AP TDP To Organise ' BC Garjana' On Octobar
అమరావతి(కాకినాడ): రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను దారుణంగా మోసం చేసిన బిజేపీని ప్రజలు ఎలా నమ్మాలని ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆ పార్టీకి కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదన్నారు. బిజేపీకి ఓట్లేయడం ప్రయాసేనని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడలో జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ.. అక్టోబరు నెలాఖరున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకే బిజేపీని చంద్రబాబు దూరం పెట్టారని హోంమంత్రి చిన రాజప్ప అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news