టీడీపీకి ఆమంచి రాజీనామా.. వైఎస్‌ జ‌గ‌న్ ను క‌లిసి ఆమంచి…!

-

 

అబ్బబ్బ.. ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. దేశం మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న ఏపీలో మాత్రం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బాగా వేడెక్కిపోతున్నాయి. ఇదివరకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. ఇవాళ టీడీపీకి ఆయన రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్సాఆర్సీపీ పార్టీలో జగన్ సమక్షంలో చేరనున్నారు.

2014 లో చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమంచి.. తర్వాత టీడీపీలో చేరారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ జగన్ ను ఆయన కలిశారు. త్వరలోనే మంచి రోజు చూసుకొని వైసీపీలో ఆమంచి చేరనున్నారు.

చీరాల నియోజకవర్గంతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధం లేని కొన్ని శక్తులు ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభావాన్ని చూపడానికి వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన రాజీనామా లేఖలో ఆమంచి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news