హిజాబ్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు… ఏదో రోజు హిజాబ్ ధరించిన వ్యక్తి ప్రధాని అవుతారంటూ…

-

దేశంలో హిజాబ్ వివాదం సంచలనంగా మారింది. చిన్నగా ప్రారంభమైన ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్యలో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి కళాశాలలు, స్కూళ్లకు రావడాన్ని మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం చెబుతూ.. మరోవర్గం విద్యార్థులు కాషాయ కండువాతో వస్తుండటం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటక హైకోర్ట్ ముందు ఉంది. ఇదిలా ఉంటే… కర్ణాటక ప్రభుత్వం
ఈనెల 14 నుంచి 19 వరకు ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ విధించారు. 

ఇదిలా ఉంటే ఈ వివాదంపై రోజుకో నేత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ, ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో రోజు ఒక హిజాబ్ వేసుకున్న వ్యక్తి ప్రధాన మంత్రి అవుతుందని అన్నారు. తాను బతికున్నా.. లేకున్నా ఇది జరుగుతుందని ఆయన అన్నారు. హిజాబ్ ధరిస్తామని ఆడపిల్లలు తమ పేరెంట్స్ తో అంటారని, అందుకు పేరెంట్స్ కూడా అంగీకరిస్తారని చెప్పారు. ఆడపిల్ల హిజాబ్ ధరించి వైద్యురాలు, కలెక్టర్, వ్యాపార వేత్త అవుతుందని కూడా అన్నారు. దీన్ని తన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news