జగన్ సర్కార్ పై భూమా అఖిల సంచలన వ్యాఖ్యలు.. కాలర్ ఎగిరేస్తారా !

-

జగన్ సర్కార్ పై భూమా అఖిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు పని పాటా లేకుండా ప్రతిపక్షాల మీద పడుతున్నారని.. ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టించాలో ఆలోచించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా పలనా అభివృద్ధి పని చేశానని కాలర్ ఎగిరెసి చెప్పే పరిస్థితి ఉందా…? అని నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకీడ్చిందని ఫైర్ అయ్యారు. ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు వేయించుకుని చుక్కలు చూపిస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో బాగా చర్చ జరుగుతోందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడానికి బాగా ఓట్లు వేసిన ఉద్యోగులను పి ఆర్సీ కోసం చుట్టూ తిరిగేలా చేసిందని మండిపడ్డారు. ‘

వైసీపీ ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇబ్బంది పెట్టిందని వెల్లడించారు. పోలీసులు ఏకపక్షంగా చేయకుంటే బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు..ఇలా అన్ని గెలిచినా అభివృద్ధి సున్నా అని చురకలు అంటించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలు అంటున్నారని ఆమె నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news