కర్నూలు జిల్లా రాజకీయాల్లో అలజడి; అఖిల ప్రియ ఫ్యాక్షన్ చేస్తుంది….!

-

కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరోసారి దుమారం రేగింది. రాజకీయంగా అసలే జిల్లాలో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఏవీ, భూమా కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడి నుంచి టీడీపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు . మాజీ మంత్రి అఖిల ప్రియ దుర్మార్గురాలు అంటూ ఆయన మండిపడ్డారు. ఆమె ఫ్యాక్షన్ కి తెరలేపింది అంటూ ఆరోపణలు చేసారు ఆయన. తనపై హత్యాయత్నం చేసిన దానిలో ఆమె, ఆమె భర్త నిందితులుగా ఉన్నారన్న ఆయన వారు ఇద్దరినీ తక్షణమే అరెస్ట్ చెయ్యాలని ఆయన పోలీసులను డిమాండ్ చేసారు.

అదే విధంగా ఒక్కసారి జైలు జీవితం గడిపితే మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదు అని ఆయన అన్నారు. తన ప్రాణాలకు ఏ భయం లేదని ఆమె చేసిన పనులు తాను కూడా చేయవచ్చన్నారు ఆయన. తనకు కార్యకర్తల మద్దతు ఉందని, పోలీసుల పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు ఏవీ. అయితే గతంలో రెండు వర్గాలకు టీడీపీ అధినేత చంద్రబాబు సయోధ్య కుదిర్చినా వాతావరణం మారలేదు.

Read more RELATED
Recommended to you

Latest news