కన్నా లక్ష్మీనారాయణకు గట్టి క్లాస్.. బీజేపీ కి బ్యాడ్ నేమ్ ?

-

ముందు వెనుక ఆలోచించకుండా అత్యుత్సాహం కలిగి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ కి బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలకు దక్షిణ కొరియా నుండి రాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు చేసిన విషయంలో అవినీతికి పాల్పడిందని కన్నా చేసిన వ్యాఖ్యలు మనకందరికీ తెలిసినదే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విజయసాయిరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. చంద్రబాబుకి కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడుపోయారని అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం అవ్వటం తో ఈ విషయం ఏపీలో పెద్ద రాజకీయ రగడ సృష్టించింది.COVID-19: JP Nadda Cautions Kanna Against Frivolous Charges On AP Govtకన్నా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్‌ విషయంలో కర్ణాటక బిజెపి ప్రభుత్వం కంటే తక్కువగా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని మీరు చెప్పిన లెక్కలు బట్టి చూస్తే కర్ణాటక బిజెపి అవినీతి చేసిందా అని ప్రశ్నించడం జరిగింది. దీంతో బిజెపి పార్టీ ఇరుక్కుపోయినట్లయింది. ఇలా చర్చ నడుస్తూ ఉండగానే వ్యవహారం మొత్తం అదుపు తప్పేలా కనిపిస్తూ ఉండడం తో ఈ విషయం జాతీయస్థాయిలో హైలెట్ అయ్యింది.

దీంతో వెంటనే బిజెపి పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… కన్నా లక్ష్మీనారాయణకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడుతూ ఈసారి విపక్షాలపై ఆరోపణలు చేసే ముందు లోతైన అధ్యయనం చేశాక, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అప్పుడు ఆరోపణలు చేయండని గట్టిగా హెచ్చరికలు చేశారు. మీరు చేసిన వ్యాఖ్యల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news