బిగ్ బ్రేకింగ్ ;బొండా ఉమా, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం…!

-

టీడీపీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేసారు. మాచర్లలో నిన్న టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ వారికి మద్దతుగా టీడీపీ నేతలు వెళ్ళగా వారు వస్తున్న విషయం తెలుసుకుని వారిని అడ్డగించి దాడులు చేసారు వైసీపీ కార్యకర్తలు. వారి కార్లను ధ్వంశం చేసి హత్యాయత్నం చేసారు. దీనితో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నేతలతో ఫోన్ లో మాట్లాడారు మీడియా ముందే. మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా… తాము ఒళ్లంతా రక్తాలతో ఉన్నామని, వైసీపీ కార్యకర్తలు డిఎస్పీ మీద కూడా దాడి చేసారని, పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని, తాము ప్రాణాల నుంచి బయట పడతామని నమ్మకం లేదని ఆయన అన్నారు.

తాము వస్తున్నట్టు పోలీస్ స్టేషన్ నుంచి వైసీపీ కార్యకర్తలకు సమాచారం వెళ్ళింది అని బొండా ఉమా వివరించారు. గన్ మెన్, లాయర్ కి ఇద్దరికీ గాయాలు అయ్యాయి. తమతో వచ్చిన లాయర్ తో పాటు తమను కూడా కర్రలతో కొట్టారని అన్నారు. పోలీసులను కూడా కొట్టారని పోలీసులు కూడా ఏమీ చేసే పరిస్థితి లేదన్నారు. తాము తెలంగాణాలో ఉన్నామని బాధితులు మీడియాతో మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా టీడీపీ నేతల కార్లు ద్వంశం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news