వైసీపీ అధికారంలోకి రాదు, స్పష్టం చేసిన బిజెపి…!

-

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయమని బిజెపి నేత సత్యకుమార్ అన్నారు. ఏపీలో వైసీపీనే మా ప్రధాన ప్రత్యర్థి అని ఆయన స్పష్టం చేసారు. వైసీపీతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం ఉందన్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేసారు. తెలుగుదేశం మునిగిపోతోన్న నావ. టీడీపీని ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని స్పష్టం చేసారు.

రాష్ట్రభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా సహకరిస్తామని ఆయన అన్నారు. బీజేపీ, జనసేన పోరాటన్ని ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. వైసీపీ, టీడీపీలు కుటుంబం, సొంత కులాల కోసమే పనిచేస్తున్నాయని, జనసేనతో పొత్తు బీజేపీకి కలసి వస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అవినీతి మచ్చలేని.. నిజాయతీ కలిగిన నాయకుడని, జనసేన పార్టీతో కలసి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news