బ్రేకింగ్: గవర్నర్ తో జగన్ భేటీ…!

-

చాలా రోజుల తర్వాత ఏపీ సిఎం వైఎస్ జగన్ రేపు ఉదయం గవర్నర్ ను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య రాజకీయ అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల అంశం కూడా ఇద్దరి మధ్య చర్చకు రానుంది. అలాగే వరద నష్టానికి సంబంధించి కూడా సిఎం జగన్… గవర్నర్ తో చర్చిస్తారు.

ఇప్పటికే అపాయింట్ మెంట్ ఖరారు అయినట్టు తెలుస్తుంది. గవర్నర్ ను కలసి చాలా రోజులు కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీపావళి పండుగ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ భేటీలో డీజీపీ, సిఎస్ కూడా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news