సాయిరెడ్డి విషయంలో బుద్ధా పశ్చాత్తాపం… టీడీపీ కొలవెరి?

-

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కరోనా బారిన పడినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కరోనా మహమ్మారి బారినపడ్డ వైసీపీ ప్రజాప్రతినిధుల జాబితాలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చేరిపోయినట్లైంది. ఇప్పటికే పలువురు వైసీపీదే ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాయిరెడ్డి ట్విట్టర్ ఫ్రెండ్ బుద్ధా వెంకన్న స్పందించారు!

అవును… వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. తాము రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప.. తమ మధ్య ఎలాంటి గట్టు తగాదాలు లేవని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.

అదేవిధంగా ఇదే విషయంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. “మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారూ” అంటూ అనిత ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజయసాయిరెడ్డి అంశంలో వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. “క్వారంటైన్ కు వెళుతున్నా అని చెప్పుకోవడం ఎందుకు, నాకు కరోనా పాజిటివ్ అని చెప్పుకోవచ్చుగా.. వై దిస్ కొలవెరి..?” అంటూ సెటైర్ వేసింది. త్వరగా కోలుకోవాలంటూ చెప్పిందనుకొండి! ఏది ఏమైనా… టీడీపీ నేతలైన బుద్ధా, అనితలు విజయసాయిరెడ్డిపై తమ ఆకాంక్షను తెలపడం కాస్త విశేషమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news