షాకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి..! సీఎం జగన్ దిగ్భ్రాంతి..!

-

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతి చెందారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాగభూషణరావు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన మృతితో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అటు పాతపట్నం నియోజకవర్గంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. నాగభూషణరావు మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రెడ్డి శాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగభూషణరావు మృతిపట్ల మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా నాగభూషణరావు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజ‌ర్వేటర్‌గా, డామ‌న్ డ‌య్యూ టూరిజం డైరెక్ట‌ర్‌గా, ప‌ర్యావ‌ర‌ణం, కాలుష్యం, అడ‌వులు, ఇంద‌న‌వ‌న‌రుల‌ శాఖ‌ల‌కు సంబంధించిన ప‌లు విభాగాల్లో ప‌నిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news