జగన్, ఫినాయిల్ రెడ్డి గార్లని చూస్తే జాలేస్తోంది: బుద్ధా వెంకన్న

-

అంతర్జాతీయ పత్రికలనే మేనేజ్‌ చేయగలిగిన వారికి జాతీయ పత్రికలు ఒక లెక్కా అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రం సంధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే సంపాదించిన లక్షల కోట్లల్లో ఉల్లిపొరంత ఖర్చు పెడితే నిత్యం ఎదో కుట్రని ప్రచారంలో పెట్టొచ్చు అని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే తాజాగా విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

‘వైఎస్ జగన్, ఫినాయిల్ రెడ్డి గార్లని చూస్తే జాలి వేస్తుంది. 151 గెలిచామని కాలర్ ఎగరేసిన 8 నెలల్లోనే ప్రతిపక్ష నాయకుడు అంతర్జాతీయ, జాతీయ మీడియాని మేనేజ్ చేసి వార్తలు రాయిస్తున్నారు అని చెప్పుకునే దుస్థితికి వచ్చారంటేనే మీ నిర్ణయాలు, విధానాలు ఎంత చెత్తగా ఉన్నాయో అర్థం అవుతుంది’ అని బుద్ధా వెంకన్న అన్నారు. ‘ప్రజాధనం కొట్టేసి బ్లాక్ పేపర్, ఛానల్ పెట్టి అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి పత్రికా విలువలను పాతాళానికి తోక్కేసిన జగన్ గారు, ఫినాయిల్ రెడ్డి పత్రికల గురించి మాట్లాడితే నమ్మే అమాయకులు ఇంకా ఉన్నారు అనుకోవడం అవివేకమే’ అని ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news