రాజ‌ధాని ఏర్పాటుపై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే..?

-

మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీలో దుమారం రేగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి స‌మ‌యంలో రాజధాని అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా ఈ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ ఆన్సర్ ఇచ్చారు.

2015 ఏప్రిల్ 4నలో నాటి జి.ఓ. ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఉందని..మూడు రాజధానులపై కూడా మీడియా నివేదికలు వచ్చాయని తెలిపారు. అయితే రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధిలోని అంశం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో కేంద్రం కలగజేసుకోలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news