బ్రేకింగ్: రఘురామ కృష్ణం రాజుకి కేంద్రం భద్రత

-

నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజుకు “వై” కేటగిరి భద్రత కల్పించింది కేంద్రం. 11 మందితో కూడిన భద్రత ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోం శాఖ. తనకు ఏపీ లో వైసిపి ఎమ్మెల్యే లతో ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఎంపీ రఘురాం కృష్ణం రాజు… ముందు స్పీకర్ ని కలిసారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తాను నియోజకవర్గంలోకి వెళ్ళలేను అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

దానిని పరిశీలించిన స్పీకర్ హోం శాఖకు పంపించారు. నిజా నిజాలు పరిశీలించి ఆయనకు భద్రత కల్పించాలి అని ఆయన సూచనలు చేసారు. ఈ నేపధ్యంలో రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి మేరకు భద్రత కల్పించింది కేంద్రం. గత కొన్ని రోజులుగా ఆయన అధికార పార్టీలో హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీలో ఉంటూనే వైసీపీ నేతలపై ఆయన చేస్తున్న కామెంట్స్ కాస్త సంచలనంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news