అమరావతి: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయస్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం వివిధ పక్షాల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో పాటు మహాకూటమి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దించింది. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నప్పటికీ.. చంద్రబాబు ప్రచారంతో మరింత ఊపు వస్తుందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ పాల్గొనే ప్రచార సభల్లో చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇద్దరు కలిసి రెండు సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ సభల తర్వాత లేదా అంతకుముందే పార్టీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. వీలైనన్ని ఎక్కువ రోడ్ షోలు నిర్వహించేలా పార్టీ నేతలు షెడ్యూల్ రూపొందించారు. సోనియా కూడా తెలంగాణలో ప్రచారం చేయనున్నప్పటికీ చంద్రబాబు ఆ సభల్లో పాల్గొనరని సమాచారం.
ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణలో చంద్రబాబు, రాహుల్ ప్రచారం
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -
చంద్రబాబు, పవన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
ఎన్నికల సందర్భంగా రాజకీయ నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొన్ని...
Ganesh -
టిడిపిలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన వేళ అధికార వైసీపీకి...
Ganesh -