బ్రేకింగ్: మరో కేంద్ర మంత్రితో జగన్, అనుకున్నది సాధిస్తారా…?

-

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఆయన భేటీ అయ్యారు. పోలవరం నిధులతో పాటుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మంత్రితో చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలి అని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేసారు.

jagan
jagan

నిన్న సాయంత్రం హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన హామీలకు సంబంధించి జగన్ కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన కోరారు. నేడు మరోసారి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం భేటీకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మీడియాకు అందలేదు.

Read more RELATED
Recommended to you

Latest news