షాకింగ్ : కాంగ్రెస్‌ నేత రాజీవ్ త్యాగి హఠాన్మరణం..!

-

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. త్యాగి నిన్న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ఓ టీవీ డిబెట్‌లో కనిపిస్తానని ఉదయం ట్వీట్ చేశారు. సాయంత్రం అయ్యే సరికి టీవీ ఛానెళ్లలో వార్తగా మిగిలారు. నిన్న మధ్యాహ్నం సమయంలో తన నివాసం నుంచి ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ త్యాగి.. ఆ డిబెట్ ముగిసిన మరుక్షణమే కుప్పకూలిపోయారు.

హాస్పిటల్‌లో చేర్పించిన కాసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు. అయితే త్యాగి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, బీజేపీ నేత సంబిత్ పాత్రాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇకపోతే త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news