దగ్గుబాటి పురందేశ్వరితో వైసీపీ కీలక నేతలు భేటీ.. చేరిక ఖాయమేనా?

-

Daggubati purandeswari to join ycp?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఇంకా వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ టీడీపీ నుంచి ముఖ్య నేతలంతా వైసీపీకి వలస కట్టారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది నేతలు వైసీపీలోకి చేరడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక.. బీజేపీ నుంచి కూడా కొంత మంది ముఖ్య నేతలు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా వైసీపీలో చేరనున్నారట. చెన్నైలో పురందేశ్వరితో వైసీపీకి చెందిన ముఖ్య నేతలు భేటీ అయ్యారట. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సినీ నటుడు మోహన్ బాబు ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. దీంతో పురందేశ్వరి కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news