ఢిల్లీకి ఈటల రాజేందర్, బండి సంజయ్ పయనం.. టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకేనా?

-

ఎలాగైనా హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తూ… ముందుకెళ్తుంది. బీజేపీ అగ్రనేత అమిత్​ షాతో ఈ రోజు బీజేపీ స్టేట్​ ఛీఫ్ బండి సంజయ్​, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సమావేశం అయ్యారు. ఈటల రాజేందర్​ గతంలో ఆరుసార్లు హుజురాబాద్​ లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇంకా ఉప ఎన్నికకు కనీసం షెడ్యూల్​ కూడా ప్రకటించకుండానే ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ చేస్తున్న హంగామా ను చూసి నియోజకవర్గ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో పక్క ఇక్కడ రోజురోజుకూ కోవిడ్​ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయినా కానీ నాయకులు ప్రచారంలో ఎక్కడా తగ్గట్లేదు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తమకు ఎదురే లేదని టీఆర్ఎస్​TRS , గెలవడం ద్వారా టీఆర్​ఎస్​ పై ప్రజల్లో వ్యతిరేఖత మొదలైందని నిరూపించాలని బీజేపీ తాపత్రయపడుతున్నాయి. రేవంత్​ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్​ కూడా స్పీడును పెంచింది.

పాడి కౌశిక్​ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న ఇంచార్జి పోస్టును సీనియర్​ నేతతో భర్తీ చేసింది. ఈ ఎన్నికల్లో మేము కూడా పోటీలో ఉన్నామని, తమను ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదని చాటి చెప్పింది. ఈ ఎన్నికల్లో గెలవకపోయినా గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్​ యోచిస్తోందట. పైగా రేవంత్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో ఉన్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news