BREAKING : మాజీ సీఎం క‌న్నుమూత‌..!

-

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మ‌హారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలంగేక‌ర్(91) మరణించారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కిడ్నీ సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గత నెల 16న కరోనాతో శివాజీరావు పాటిల్ పుణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను మళ్లీ హాస్పిటల్‌లో చేర్చారు. ఈ క్రమంలో ఆయన కిడ్నీలు ఫెయిలై మృతి చెందారు. పాటిల్‌ ఈ రోజు ఉదయం మరణించారని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ఇకపోతే 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news