టీటీడీలో జగన్ అక్రమాలకు పాల్పడ్డారు : మాధవీలత ఫైర్

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పాలకుడు చేయని అక్రమాలను మాజీ సీఎం వైఎస్ జగన్ చేశాడని తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత విమర్శించారు. శుక్రవారం ఆమె తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నాక ఆమె‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ స్వామివారి దర్శనానికి వచ్చేట‌ప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. వారి హయాంలో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.

గత ఐదేళ్లలో తిరుమల పవిత్రతను కాపాడలేదని విమర్శించారు. అయితే, వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీతో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం కోసం తిరుమలను సందర్శించినట్లు మాధవీలత పేర్కొన్నారు. వందేభారత్ రైలులో సహచర భక్త బృందంతో కలిసి గోవిందుడి నామం జపిస్తూ..శ్రీనివాసుడి పాటలు పాడుతూ ఆమె తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version