నోటికి ఏదోస్తే అది మాట్లాడుతావా .. జగన్ కి కోపం తెప్పిస్తున్న వైకాపా ఎమ్మెల్యే..!!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వైసిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి చేసిన వ్యాఖ్యలు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా జోగి రమేష్.. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు వైఎస్‌ జగన్ దాకా వెళ్లడంతో ఫుల్ సీరియస్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై జోగి రమేష్ మీడియా సమావేశంలో ఏమన్నారంటే..ఇటీవల రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు దగ్గర 2019 ఎన్నికల ముందు వరకు పనిచేసిన మాజీ పిఎ శ్రీనివాస్ చౌదరి దగ్గర జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్లు బయటపడినట్లు వార్తలు వచ్చాయి. Image result for jogi ramesh

అయితే టీడీపీ పార్టీ తరుపున ఎప్పుడు వైసిపి పార్టీని విమర్శించే దేవినేని ఉమా ఇంకా కొంత మంది నేతలు గత నాలుగు రోజులు ఎందుకు మీడియా ముందుకు రావటం లేదని ఐటి రైడ్ విషయంలో పట్టుబడిన డబ్బులు విషయంలో ఎందుకు గత నాలుగు రోజులు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులను ఎదవలు మరియు పిచ్చి కుక్కలు అని జోగి రమేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. 

 

ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి..పీకే అంటే అందరికి పవన్ కళ్యాణ్ కావచ్చు అని, కానీ నాకు మాత్రం తాజాగా పీకే అంటే పిచ్చికుక్క అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల పట్ల జగన్ ఫుల్ సీరియస్ అయ్యాడట. వెంటనే జోగి రమేష్ ని తన ఛాంబర్ కి పిలిపించుకుని ప్రభుత్వం తరుపున మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో నోటికి ఏదోస్తే అది .. తలలో ఏం తడితే అది మాట్లాడటం మంచిది కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. ఏదైనా కౌంటర్ రూపంలో మాట్లాడాలని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే పార్టీ పరువు ప్రభుత్వం పరువు పోతుందని జోగి రమేష్ కి గట్టిగా జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news