చెత్త పన్నుపై కొడాలి-పేర్ని రివర్స్..జగన్ తగ్గుతారా?

-

జగన్ ప్రభుత్వం వచ్చాక సరికొత్త పన్నులు ప్రజలపై భారం పెంచిన విషయం తెలిసిందే..ఎంత కాదు అనుకున్న, గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న…జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం గట్టిగానే పెంచింది. ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్నట్లు…బాదుడే..బాదుడు కార్యక్రమాన్ని నిజం చేస్తున్నట్లే కనిపిస్తోంది.

ఆర్ధిక పరమైన ఇబ్బందులు వల్ల కావొచ్చు..ఆదాయం తక్కువ రావడం వల్ల కావొచ్చు…జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెరిగాయి…ఇంటిపన్ను, ఆస్తి పన్ను, పెట్రోల్, డీజిల్ లపై పన్నుల భారం పెరిగింది. ఇక కొత్తగా చెత్త పన్ను కూడా వేసింది..దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. అయినా సరే చెత్త పన్ను విషయంలో జగన్ ప్రభుత్వం తగ్గలేదు…చెత్త పన్ను కట్టకపోతే…కట్టని వారి ఇంటి ముందు గాని, ఆఫీసు ముందు గాని చెత్త వేసే స్థాయికి పరిస్తితి వెళ్లింది.

కరోనా వల్ల అసలే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు…ఇలాంటి సమయంలో పన్నులు భారం పెంచడం వల్ల ప్రజలకు కష్టాలు పెరిగాయి..పైగా నెల నెల చెత్త పన్ను కట్టడం భారమైపోతుంది…అద్దెకు ఉన్నవారిపై చెత్త పన్ను భారం ఎక్కువ ఉంటుంది. ఇదే విషయంపై తాజాగా గుడివాడ టౌన్ లో గడప గడపకు వెళ్ళిన మాజీ మంత్రి కొడాలి నానికి వింత అనుభవం ఎదురైంది..గుడివాడలో చెత్త పన్ను కింద నెలకు రూ.90 వసూలు చేస్తున్నారు…ఇది తమకు భారమైపోయిందని, అద్దెకు ఉంటున్నవారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక ప్రజలు…కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే కొడాలి స్పందిస్తూ..చెత్త పన్ను వసూలు చేయొద్దని మున్సిపల్ అధికారులని ఆదేశించారు…కానీ చెత్త పన్ను వసూలులో గుడివాడ మంచి పొజిషన్ లో ఉందని…నెలకు రూ.16 లక్షల టార్గెట్ అయితే…రూ.14 లక్షలు వసూలు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ చెత్త పన్ను అంశం సీఎం జగన్ కే వివరించి…ప్రజలపై భారం తగ్గించాలని చెప్పి కొడాలి నాని…తన సహచరుడు మాజీ మంత్రి పేర్ని నానితో మాట్లాడారు.

చెత్త  పన్ను వసూళ్లు ఇబ్బందిగా ఉన్నాయని, దీనిపై సీఎంని కలుద్దామని కొడాలి, పేర్నికి వివరించారు. అయితే ఇద్దరు నేతలు…జగన్ కు సన్నిహితులే…మరి వీరి చెబితే జగన్ చెత్త పన్నుపై వెనక్కి తగ్గి..ప్రజలపై భారం తగ్గిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news