కౌశిక్ రెడ్డిని కాస్త పట్టించుకోండి గురు! 

-

మరి తాను రాజకీయంగా వెనుకబడిపోతున్నానని అనుకుంటున్నారో లేక…మీడియాలో కనిపించకపోతే ప్రజలు తనని గుర్తు పట్టరు అనుకుంటున్నారో తెలియదు గాని…ఈ మధ్య కౌశిక్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా కౌశిక్ రెడ్డి అంటే హుజూరాబాద్ ఉపఎన్నికల వరకు ఎవరికి పెద్ద ఐడియా లేదు. కానీ ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో ఉంటూనే…టీఆర్ఎస్ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. దీంతో కాంగ్రెస్…కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది..ఈ క్రమంలో కౌశిక్…టీఆర్ఎస్ లోకి వచ్చారు.

అలాగే హుజూరాబాద్ టికెట్ ఆశించారు గాని…ఆయనకు సీటు దక్కలేదు…అయినా సరే టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. కానీ ఈటల చేతులో టీఆర్ఎస్ ఓడింది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కూడా వచ్చింది. ఇంకా అంతే తర్వాత నుంచి కౌశిక్ పెద్దగా కనబడలేదు…అయితే టీఆర్ఎస్ టార్గెట్ గా ఈటల దూసుకెళుతున్నారు…ఆ పార్టీలోని నేతలని బీజేపీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు…అలాగే నెక్స్ట్ గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ని ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈటల స్ట్రాటజీలకు ఎలా బదులు చెప్పాలో తెలియక…కౌశిక్ రెడ్డి దమ్ముంటే హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని..సమయం సందర్భం ల సవాళ్ళు విసురుతున్నారు. ఈటల అంటే ఏంటో హుజూరాబాద్ ప్రజలకు తెలుసు…కానీ ఈటల…గజ్వేల్ కు వెళుతూ..హుజూరాబాద్ ప్రజలని మోసం చేస్తున్నారని కౌశిక్ నిరుపయోగమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆగష్టు 5న హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని, రాలేదంటే ఆయన అభివృద్ధి చేయనట్లు ఒప్పుకున్నట్లే అని కౌశిక్ అంటున్నారు.

అసలు కౌశిక్ మాటలు చూస్తుంటే..చిన్న పిల్లల సవాల్ మాదిరిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే టీఆర్ఎస్-బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంటే…మధ్యలో కౌశిక్ రెడ్డి కామెడీ ఏంటి అనే పరిస్తితి. పైగా కౌశిక్ సవాల్ ని ఈటల కాదు కదా…బీజేపీ కార్యకర్త కూడా పట్టించుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news