కంకిపాడులో ఇద్దరు బాలికలు అదృశ్యం.. అతడిపనే..!

-

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు జడ్పీ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. పాఠశాలలో చదువుతున్న 9వ తరగతికి చెదిన విద్యార్థినులు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయారు.

విద్యార్థులను అదే గ్రామానికి చెందిన గుండి జోజి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థుల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తున్నాడు. స్థానికంగా ఆర్క్‌ వెల్డర్‌గా పనిచేసే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక బాబు ఉండగా పది రోజుల క్రితం పాప జన్మించిందని పోలీసులు తెలిపారు

విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోజి కోసం పోలీసులు వాకబు చేయగా.. అతను సోమవారం మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జన శతాబ్ది ట్రైన్​లో చెన్నై వైపు వెళ్లినట్లు గుర్తించారు. అతడి కోసం పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news