ల‌గ‌డ‌పాటి ప‌రువు గంగ‌లో క‌ల‌సింది..!

-

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరు గాంచిన ల‌గ‌డ‌పాటి ఇచ్చిన స‌ర్వే వ‌రుస‌గా రెండోసారి కూడా అబ‌ద్ద‌మ‌ని తేలింది. గ‌తంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల సంద‌ర్భంగా ప్ర‌జా కూట‌మి గెలుస్తుంద‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి అందుకు వ్య‌తిరేకంగా ఫ‌లితాలు రావ‌డంతో ఖంగుతిన్నారు. ఇక ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ ల‌గ‌డ‌పాటి చెప్పిన స‌ర్వేకు వ్య‌తిరేకంగానే ఫ‌లితాలు వ‌చ్చాయి. దీంతో ల‌గ‌డ‌పాటి ప‌రువు గంగ‌లో క‌ల‌సిపోయింది.

ఏపీలో టీడీపీకి 90 నుంచి 110 స్థానాలు వ‌స్తాయ‌ని, వైసీపీకి 72 స్థానాలు వ‌స్తాయ‌ని ల‌గ‌డ‌పాటి తెలిపారు. కానీ ఇవాళ వ‌చ్చిన ఫ‌లితాలు మాత్రం ఎక్క‌డా పొంతన లేకుండా ఉండ‌డం విశేషం. మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 148 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతుండ‌గా, టీడీపీ 27, జ‌న‌సేన 0 సున్నా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ల‌గ‌డ‌పాటి ప‌చ్చ పార్టీల‌కు అనుకూలంగానే అలా స‌ర్వే ఫ‌లితాలు చెప్పార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఈ ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి ఏమంటారో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news