ఇవాళ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్న చంద్రబాబు

-

అమరావతి: ఏపీలో వార్ వన్‌సైడ్ అయిపోవడంతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమైపోయింది. ఇప్పటి వరకు వైసీపీ 150 సీట్లలో లీడ్‌లో ఉంది. టీడీపీ 24 సీట్లకే పరిమితం కాగా.. జనసేన ఒక్క సీటు లీడ్‌లో ఉంది. దీంతో జగన్ ముఖ్యమంత్రిగా ఖాయమైపోయినట్టే. టీడీపీ ఓటమి దిశగా వెళ్తుండటంతో.. చంద్రబాబు ఇవాళ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయునన్నారు.

ఇక.. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 25న తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వైఎస్ జగన్.. ఇంతకుముందే విశాఖ శారదాపీఠాధిపతికి ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news