మమత ప్రతిపక్ష సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా

-

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో 22 మంది ప్రతిపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లేఖలు కూడా రాసింది దీదీ. ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా సమావేశానికి హాజరుకావాాల్సిందిగా లేఖ రాసింది. ఇప్పటికే పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు వెల్లడించాయి. కేరళ పినరయి విజయన్ కూడా తన పార్టీ నుంచి ప్రతినిధులను పింపిస్తున్నారు. ఇదే విధంగా శివసేన కూడా సమావేశానికి హాజరవుతానని వెల్లడించింది. అయితే ఈ సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాబోవడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరు కావడమే అని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో  ఈ రోజు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేస్తోంది. అన్ని పార్టీలు కలిసి ఎన్సీపీ అభ్యర్థి శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దింపుతారనే టాక్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news