పాపం.. సెల్ఫీలకు పోజులిచ్చి బంగారు కడియం పోగొట్టుకున్న తెలంగాణ మంత్రి..!

-

ఎంకిపెళ్లి సుబ్బి చావు కొచ్చినట్టు పెళ్లికి వెళ్లి అభిమానుల‌తో సెల్ఫీలకు పోజులిచ్చిన మంత్రికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. అభిమానులతో కలిసి సెల్ఫీ దిగిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన చేతి బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు.

ఆ తర్వాత చూసుకుంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది. అయినా లాభం లేకపోవడంతో తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇక ఏకంగా మంత్రి చేతికి ఉన్న బంగారు కడియం మాయం కావడంపై స్థానికంగా పెద్ద చర్చే జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news