బండి సంజయ్ పై తెరాస ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలు

-

తెరాస ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని వ్యక్తిగతంగా విమర్శించారు. ఇటీవల బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చారు. బండి సంజయ్ అబద్ధాలకోరు, పచ్చి మోసగాడు అని ఆరోపించారు. సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇచ్చింది 200కోట్లైతే 7వేల కోట్లు అని అబద్దమాడుతున్నారని మండిపడ్డారు.

TELANGANA RASHTRA SAMITI amblem

ఈ అంశంపై బండి సంజయ్ తో కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ చేసారు. సవాల్ ను స్వీకరించి చర్చకు బండి సంజయ్ సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేసారు. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది బండి సంజయ్ లేదని విమర్శలు చేసారు. పొద్దున లేస్తే అబద్ధాలు మాట్లాడటమే బండి సంజయ్ పని అంటూ సుంకే రవి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news